తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్. ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు మరియు పోలీస్ అధికారులు ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్నా చెడు నడత (షీటర్స్) కలిగిన వ్యక్తులకు మంగళవారం సాయంత్రం డిఎస్పీ ఆఫీస్ వద్ద కౌన్సెలింగ్‌ నిర్వహించారు.ఒంగోలు డిఎస్పీ వారితో మాట్లాడుతూ చెడు నడత కలిగిన వ్యక్తులు(షీటర్స్) నేర ప్రవృత్తిని వీడనాడి సద్భుద్దితో జీవించాలని, సత్ప్రవర్తనతో మెలగాలని, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించే విధంగా వ్యవహారించవద్దని, గత జీవితాన్ని వదలి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, వివాదాలకు దూరంగా ఉండాలని, సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సూచించారు. వారిలో పరివర్తన కలిగేలా కౌన్సిలింగ్ నిర్వహించారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, చట్టాన్ని అతిక్రమించి దౌర్జన్యాలు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించి కౌన్సిలింగ్ నిర్వహించినారు. బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించి గొడవలు, అల్లర్లు మరియు ఇతర నేరాల్లో పాల్గొంటే కనీసం లక్ష రూపాయల వరకు ఆస్తులు జప్తి చేయబడతాయని సూచించారు.డీఎస్పీ వెంట ఎస్సైలు సాంబశివయ్య, సుబ్రహ్మణ్యం మరియు సిబ్బంది ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *