తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:-
ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిని కలిసిన డా. గొట్టిపాటి లక్ష్మీ దర్శి ప్రాంతానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.దర్శి లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్నందున, నూతన కార్యాలయం నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరారు. దీనిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సానుకూలంగా స్పందించగా, డా.గొట్టిపాటి లక్ష్మీ మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.