తొలి శుభోదయం న్యూస్ అద్దంకి:-
అవగాహన కలిగించాల్సిన ఆవశ్యకత ఉందని ప్రకాశం జిల్లా వెలుగు డిఆర్డిఏ డిపిఎం ఆర్. ఆర్. ఎల్ అంబేద్కర్ పేర్కొన్నారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, దిష ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉన్న వెలుగు డిఆర్డిఏ సి సి లకు అకౌంటెంట్లకు అద్దంకిలోని వెలుగు డిఆర్డిఏ శిక్షణ కార్యాలయంలో హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూల కొరకు ఇంటెన్సిఫైడ్ ఐ. ఈ సి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బీవి సాగర్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన కొరకు క్షేత్రస్థాయి వరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి సమాజంలో లేదని ఒక అపోహలో ఉన్నారని సమాజంలో ఉన్న ఈ అపోహలని తొలగించాల్సిన బాధ్యత మనపై ఉందని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి రోజు రోజుకి వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుందని ఇది చాలా బాధాకరమైన విషయం అని ఈ వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించాలంటే ఈ వ్యాధిపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఉందని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కొరకు ప్రభుత్వం వైద్యశాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని హెచ్ఐవి ఎయిడ్స్ జాతీయ టోల్ ఫ్రీ 1097పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రకారం జిల్లా వెలుగు, డి. ఆర్ డి,ఎ, డి. పి ఎమ్ ఓ సుధాకర్ హెల్ప్ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ బి దుర్గా సురేంద్ర ఎమ్. ఈ. ఏ పి మహేష్ ఏ. ఎన్. ఎమ్ విజయలక్ష్మి ఔట్ రిచ్ వర్కర్లు టీ దుర్గ భవాని వి వల్లేశ్వరి పాల్గొన్నారు.…