తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ జూదం, కోడిపందేల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పోలీసులు మూడు వేర్వేరు ప్రాంతాల్లో సమన్వయంతో దాడులు నిర్వహించి నేరస్తులను పట్టుకున్నారు.సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలికివాయ గ్రామ శివార్లలో కోడిపందేలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి నిర్వహించి రూ.17,000 నగదు మరియు 3 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా కంభం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబాలెం గ్రామ పొలాల్లో పేకాట ఆడుతున్న 6 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.2,900 నగదు, 6 సెల్ ఫోన్లు మరియు 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఇంకా వి.వి. పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్ల అమ్మపాలెం పొలాల్లో కోడిపందేలు నిర్వహిస్తున్న 4 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి 3 కోళ్లతో పాటు రూ.15,150 నగదును స్వాధీనం చేసుకున్నారు.అక్రమ జూదం, కోడిపందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలు చట్ట విరుద్ధమని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ప్రకాశం జిల్లా పోలీసులు హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *