తొలి శుభోదయం ప్రకాశం:-
కొండపిలో నిర్వహించనున్న తేపోత్సవం నేపథ్యంలో ప్రకాశం జిల్లా పోలీసులు కొండపి చెరువు వద్ద చేపట్టిన భద్రతా, ట్రాఫిక్ మరియు జనసందోహ నియంత్రణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ తనిఖీలను కొండపి సీఐ ఆధ్వర్యంలో నిర్వహించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా పార్కింగ్ ఏర్పాట్లు, బ్యారికేడింగ్, లైటింగ్, అత్యవసర సేవలు, ట్రాఫిక్ మళ్లింపులు వంటి అంశాలను సమీక్షించారు. ఉత్సవాల సమయంలో తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ప్రకాశం జిల్లా పోలీసులు భక్తులు మరియు ప్రజలు పోలీసులతో సహకరించి, సూచనలు పాటించి, శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.