తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఆంధ్రప్రదేశ్లో ప్రారంభంకానున్న పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా వంటి చర్యలు తీసుకుంటూ విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.