తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కల్చరల్ వింగ్ జిల్లా అధ్యక్షులు కంపరాజు సాంబశివరాజు అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్ ఒక ప్రకటనలలో తన తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. గుడ్లూరు మండలంలో సీనియర్ నాయకుడుగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసే వారన్నారు.పొట్లూరు గ్రామంలో, గుడ్లూరు మండలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నతమైన సేవలు సాంబశివరాజు అందించారు.ఆయన మరణం కుటుంబంతోపాటుగా వైఎస్సార్ కుటుంబాన్నికి కూడా ఎంతో బాధను మిగిలించిందని తన సంతాప సందేశంలో తెలిపారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.