తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా నూతన డిఆర్ఓగా ఎం.వెంకట శివరామిరెడ్డి బుధవారం కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రెవిన్యూ అధికారులు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. ఇప్పటివరకు ఆయన ఎస్ డీ సి (కంభం), ఇన్చార్జి కనిగిరి ఆర్డీవో గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్వో మోహన్ రాజు, ఏఓ రవీంద్రారెడ్డి, తహసిల్దార్ చిరంజీవి, ఇతర రెవెన్యూ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.