తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
శాఖా గ్రంధాలయం టంగుటూరు లో శనివారం అనగా తేది 6-6-2026 న వేసవి విజ్ఞాన తరగతుల ముగింపు సభ కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆయుర్వేదం హాస్పటల్ మెడికల్ ఆఫీసర్ షరీఫ్ గారు పాల్గొన్నారు జరిగిన వేసవి విజ్ఞాన తరగతులు ముగింపు సభలో వారు మాట్లాడుచు పిల్లలందరూ చక్కగా వేసవితరగతులలో పాల్గొని ఇష్టపడి చదువు కుంటు కథలు,పొడుపుకదలు ,ఇంగ్లీష్ గ్రామర్,యోగా మాస్టర్ చే శిక్షణ ఇవ్వడం లాంటి కార్యక్రమాలలో చక్కగా పాల్గొని అన్ని నేర్చుకున్నారని అలాగే రేపటి నుండి ప్రతి ఆదివారం చదవటం నాకిష్టం కార్యక్రమము జరుగుతుంది ఆ కార్యక్రమంలో పాల్గొనాలని గ్రంథాలయాని ఉపయోగించు కోవాలని వారు విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం పొడుపు కథలు పుస్తకాలు చదివి అర్థం చెప్పిన వారికి వివిధ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులిచ్చారు