తొలి శుభోదయం న్యూస్ కంభం:-
యోగాంధ్ర ఉత్సవాల్లో భాగంగా కంభం చెరువు కట్టపై నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గారు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీవో ఎం. వెంకట శివరామిరెడ్డి, కనిగిరి ఆర్డీవో అజయ్ కుమార్, ఇతర అధికారులు సిబ్బంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు చేశారు. యోగా గురువులు చెప్పిన విధంగా గా గంటపాటు కలెక్టర్, ఎమ్మెల్యే, ఇతర అధికారులు ఆసనాలు చేసి యోగ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు. దాదాపు 2 వేల మంది ప్రజలు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు.