google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారి ప్రత్యేక చొరవతో రాయవరం KGBV పాఠశాల ఆవరణకు కొత్త శోభ వచ్చింది.ఇటీవల పాఠశాల పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడ క్వారీలు,చెట్లతో అద్వాన్నంగా ఉన్న సమస్యను పాఠశాల సిబ్బంది కలెక్టర్ దృష్టి కి తీసుకువచ్చారు.పాఠశాల లో ఉన్న క్వారీలను పరిసరాల ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.దీంతో మైనింగ్ అధికారులు పాఠశాల ఆవరణలో ఉన్న చిల్లచెట్లు, క్వారీలను మట్టితో పూడ్చి చదును చేసి సమస్యను పరిష్కరించారు.దీంతో శుక్రవారం మరోసారి పాఠశాల కు వెళ్లిన కలెక్టర్ విజయ సునీత గారికి, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, జిల్లా మైనింగ్ అధికారి రవి ప్రసాద్ కు పాఠశాల సిబ్బంది,విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *