తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు అంబేద్కర్ భవనంలో నిర్వహించిన మహిళా కార్మికుల హక్కులు, కార్మిక చట్టాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై జిల్లాస్థాయి అవగాహన సమావేశం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ ఇంచార్జి ప్రాజెక్టు డైరెక్టర్ సుధాదేవి , సఖి సెంటర్ అదనపు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గౌతమి , లేబర్ డిపార్ట్మెంట్ అధికారిణి ఎలిజబెట్ రాణి , DMHO అధికారి నాయబ్ రసూల్, జిల్లా బాలల సంరక్షణ అధికారి (DCPU) దినేష్,న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మరియు మహిళా కార్మికులు పాల్గొన్నారు.
మహిళల హక్కుల పరిరక్షణ, చట్టాలపై అవగాహన, ప్రభుత్వ సంక్షేమ పథకాల వినియోగంపై విలువైన సమాచారం అందించబడింది.