అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సాయాన్ని కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొని పథకాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు & ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. నూకసాని బాలాజీ గారు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు గారు, నియోజకవర్గ పరిశీలకులు రాఘవేంద్ర గారు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *