google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో, నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (AIILSG) సహకారంతో కనిగిరి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు సామర్థ్యాభివృద్ధి మరియు నైపుణ్య శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శ్రీ శ్రీధర్ గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు పట్టణ పరిశుభ్రతకు వెన్నెముకలని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో వారి పాత్ర ఎంతో కీలకమని, విధి నిర్వహణలో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE) తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అలాగే తడి, పొడి మరియు గృహ ప్రమాదకర వ్యర్థాలను మూలం వద్దనే వేరు చేయించడం ద్వారా పరిశుభ్రమైన పట్టణ నిర్మాణానికి ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీ నయాబ్ రసూల్ గారు మాట్లాడుతూ, రోజువారీ పారిశుద్ధ్య కార్యకలాపాల్లో నాణ్యత, సమయపాలన మరియు ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం అత్యంత అవసరమని తెలిపారు. పరిశుభ్రతతో పాటు కార్మికుల భద్రతకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.AIILSG రిసోర్స్ పర్సన్ శ్రీ దత్తం కోటేశ్వరరావు గారు శిక్షణను నిర్వహిస్తూ ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, మూలం వద్ద వ్యర్థాల వేరు చేయడం, వ్యక్తిగత రక్షణ పరికరాల వినియోగం, ఆరోగ్య భద్రత, పరిశుభ్రత ప్రమాణాలు, స్వచ్ఛ సర్వేక్షణ్ లక్ష్యాలు, RRR కేంద్రాలు, MRF సెంటర్ల ప్రాముఖ్యత మరియు వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పించారు. శిక్షణలో పాల్గొన్న కార్మికుల సందేహాలకు సమాధానాలు ఇస్తూ క్షేత్రస్థాయిలో పాటించాల్సిన ఉత్తమ పద్ధతులను వివరించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు ఉత్సాహంగా పాల్గొని, తమ విధుల్లో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు అవగాహనను పెంపొందించుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య కార్మికుల సామర్థ్యాన్ని పెంపొందించి, కనిగిరి పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మరియు AIILSG సంయుక్తంగా కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *