తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో కొండేపి మండల పార్టీ అధ్యక్షులు బచ్చల కోటేశ్వరరావు గారు, కొండేపి మండల యూత్ లీడర్ తిప్పులూరి రవీందర్ రెడ్డి గారు, కొండేపి మండల స్టూడెంట్ వింగ్ శ్రీహరి గారు, తో పాటు మండలలోని జిల్లా, రాష్ట్ర, నియోజకవర్గ స్థాయి నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, సెక్రటరీలు, కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, యువజన మరియు విద్యార్థి విభాగ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేశారు.