తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో పెరుగుతున్న నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని కందుకూరు పట్టణం ఆరో వార్డు సుందరయ్య నగర్ నందు నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఐద్వా జిల్లా నాయకులు ఎస్ కే మునువర్ సుల్తానా మాట్లాడుతూ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల లాభాలు తెచ్చి పెడుతూ ధరల మీద నియంత్రణ లేకుండా పోయిందని హద్దు అదుపు లేకుండా ధరలు పెంచుకుంటా పోతున్నారని పేదలు మధ్యతరగతి మీద భారం పడుతుందని వెంటనే పెరుగుతున్న ధరలను తగ్గించాలని కార్పొరేట్ సంస్థల నిలువ చేసిన నిత్యవసర వస్తువులను బయటికి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈనెల కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం జరుగుతుందని మహిళలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా పట్టణ కార్యదర్శి ఎస్కె మల్లిక ధనలక్ష్మి గారు అస్మా సుందరయ్య నగర్ కాలనీ నివాసులు పాల్గొన్నారు