తొలి శుభోదయం :-
Womens World Cup 2025లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 3 వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది. కాగా వర్షం కారణంగా మ్యాచ్ ని 44 ఓవర్లకు కుదించి.. 325 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఛేదనలో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 రన్స్ మాత్రమే చేసింది. దీంతో టీం ఇండియా 53 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. తప్పక గెలివాల్సిన ఈ మ్యాచులో విజయం సాధించి భారత్ సెమీస్ చేరింది.