అభినందనలు తెలియజేసిన స్కూల్ డైరెక్టర్ వి.షాలిని రెడ్డి
తొలి శుభోదయం కందుకూరు:-
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా మరియు నియోజకవర్గస్థాయి కాంపిటేటివ్ పోటీలలో పాల్గొన్న కందుకూరు నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విశేషమైన ప్రతిభను కనపర్చి బహుమతులను సాధించటం పట్ల స్కూల్ డైరెక్టర్ వి. షాలిని రెడ్డి ఒక ప్రకటనలో విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. జిల్లా స్థాయిలో జరిగిన వకృత పోటీల్లో స్కూల్ విద్యార్థి ఎస్. ఆదిత్య నెల్లూరు జిల్లా కలెక్టర్ చేతులు మీదగా బహుమతిని అందుకోవడం జరిగినది. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గ స్థాయి లో జరిగిన వ్యాసరచన పోటీల్లో Sd.ఫైజా ఉత్తమ ప్రతిభను కనపరచి విజేతగా నిలిచినది. కందుకూర్ సబ్ కలెక్టర్ చేతులు మీదగా అవార్డును అందుకున్నారు. ఉన్నతాధికారుల చేతులు మీదుగా బహుమతులు అందుకున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేసిన వారిలో స్కూలు ప్రదోనోపాధ్యాయులు ప్రకాష్, వి. మర్రెడ్డి, కరణం శ్రీనివాసరావు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ఉన్నారు.