తొలి శుభోదయం న్యూస్ తూర్పునాయుడుపాలెం:-
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Intensive Revision) కార్యక్రమంపై క్షేత్రస్థాయిలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు. సోమవారం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో BLO, పలువురు సిబ్బంది మంత్రిని కలసి ఎన్యుమరేషన్ ఫామ్ అందించి వివరాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి డా.స్వామి మాట్లాడుతూ….సర్వేలో బూత్ లెవల్ అధికారులు (BLO) కచ్చితమైన డేటాను సేకరించాలని సూచించారు. అర్హులైన ఓటర్లు అందరూ జాబితా లో ఉండేలాగా జాగ్రత్తగా ప్రక్రియ చేపట్టాలని. ప్రత్యేక ఓటర్ల నమోదుపై క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAs) పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు.