google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా త్రిపురాంతకం పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటారు. మొబైల్ ఫోన్ పోయినట్లు అందిన ఫిర్యాదు మేరకు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మొబైల్ ఫోన్‌ను విజయవంతంగా ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఆ మొబైల్ ఫోన్‌ను అసలు యజమాని అయిన ఫిర్యాదుదారునికి అందజేసి వారి ఆనందానికి కారణమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు CEIR పోర్టల్ ద్వారా కూడా వివరాలు నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే పోయిన మొబైల్‌ను గుర్తించి తిరిగి అందించే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *