కొండపి నుండి మద్దులూరు మీదుగా ఒంగోలు వెళుతున్న ఆర్టీసీ (ప్రైవేట్ సర్వీస్) బస్సు (నెంబర్: AP39TF 1589) అనకర్లపూడి – మద్దులూరు గ్రామాల మధ్య ఉన్న కోల్డ్ స్టోరేజ్ వద్ద ఒక ప్రమాదకరమైన మలుపుకు చేరుకుంది. ఆ సమయంలో రోడ్డు మార్జిన్ సరిగ్గా లేకపోవడంతో, ఎదురుగా వస్తున్న మరో వాహనానికి దారి ఇచ్చే క్రమంలో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి ఒరిగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, బస్సు పూర్తిగా తిరగబడకపోవడంతో ఒక పెద్ద ప్రాణనష్టం తప్పినట్లయింది.ప్రయాణికులందరూ అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, 108 వైద్య సిబ్బంది వేగంగా ఘటనా స్థలానికి చేరుకుని, బాధితులకు అవసరమైన ప్రథమ చికిత్స అందించి సహాయక చర్యలు చేపట్టారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *