తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా ముండ్లమూరు మండలం నూజల్లపల్లి గ్రామంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం విజయోత్సవంగా కొనసాగింది.దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గారు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.తల్లికి వందనం, మహిళా శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం–2, ఎన్టీఆర్ భరోసా, సూపర్ సిక్స్ తదితర పథకాల వివరాలతో కరపత్రాలను పంపిణీ చేశారు.ప్రజలతో మమేకమై.. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను వివరిస్తూ సాగుతున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరుస్తోంది.