తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
శ్రీ చైతన్య స్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్. B. వెంకట్రావు విచ్చేసి జాతీయ జండా ను ఎగరవేసారు. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలుతో పాటు 300మీటర్ల జాతీయ జండా తో విద్యార్థులు భారీ ర్యాలీ ని పాఠశాల ప్రాంగణం నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు వందేమాతర నినాదాలతో ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి ని చాటుకున్నారు. ఈ సందర్భం గా ప్రిన్సిపాల్ శ్రీమతి D. మెగోమి మాట్లాడుతూ ప్రతివిద్యార్థి దేశం కోసం త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల ను సూర్తిగా తీసుకొని అంకిత భావంతో దేశసర్వతో ముఖాభి వృద్ధికి పాటు పడాలని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఏజియం. అంజయ్య . ఆర్ ఐ. అనీల్ కుమార్ . ప్రిన్సిపాల్ డి. మెగోమి. కోఆర్డినేటర్ జీ. శ్రీనివాస్ రావు. డీన్ G. బ్రహ్మయ్య. సి బ్యాచ్ ఇంచార్జ్ టి. శివయ్య. ప్రైమరి ఇంచార్జి సాయిశ్రీ . ప్రీప్రైమరి . ఇంచార్జి ప్రసన్న . A O. P. హరికృష్ణ . బోధనా భోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేశారు.