తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
ముప్పవరపు ఫౌండేషన్ తరఫున ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీ హర్షవర్ధన్ బాబు గారికి, శ్రీమతి రాధమ్మ గారికి, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించిన ఈ బెంచీలు వారి చదువుకు ఎంతో ఉపయోగపడతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ముప్పవరపు ఫౌండేషన్ అందిస్తున్న సహకారం అభినందనీయం.