ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నంగి గ్రామం శివారులో తేదీ:26.08.2026న మధ్యాహ్నం సమయంలో పేకాట స్ధావరంపై టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ CI కమలాకర్ గారు ఆధ్వర్యంలో SI C. చెంచయ్య , ఏఎస్ఐ షేక్ మహబూబ్ బాషా మరియు వారి సిబ్బంది ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 6 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.50200/- నగదు, 7 మొబైల్ ఫోన్లును స్వాధీనం చేసుకున్నారు. వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు నిమిత్తం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించడం అయినది .ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే, జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఉంటే, వెంటనే డయల్ 112 నంబర్‌కు లేదా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ సిఐ 9121102113,పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *