పేకాట స్థావరంపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.. 6 అదుపులోకి, రూ.1,01,070 నగదు, 6 సెల్ఫోన్లు, ఒక మోటార్సైకిల్ స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాయుడుపాలెం గ్రామ రైల్వే ట్రాక్ పక్కన శివారులో తేదీ: 03.09.2026న మధ్యాహ్నం సమయంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ CI కమలాకర్ గారి ఆధ్వర్యంలో SI బి. వినోద్ బాబు, ఏఎస్ఐ షేక్ మహబూబ్ బాషా మరియు వారి సిబ్బంది ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.ఈ దాడిలో 6 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.1,01,070/- నగదు, 6 మొబైల్ ఫోన్లు, 1 మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు నిమిత్తం టంగుటూరు పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే, జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఉంటే, వెంటనే డయల్ 112 నంబర్కు లేదా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ సిఐ 9121102113, పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు.