జన విజ్ఞాన వేదిక కంభం మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు మండల స్థాయి జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం వీరనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు. అనంతరం జరిగిన మండల స్థాయి చెకుముకి పరీక్షలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల , తురిమెళ్ళ విద్యార్థులు (యాసీన్, దినేష్ ,జగదీష్) మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించారు. అలాగే ప్రైవేట్ పాఠశాల విభాగం నందు ఆల్ఫా హై స్కూల్ ,కంభం విద్యార్థులు( విక్రాంత్ రెడ్డి, శ్రీహరి, ఉపేంద్ర రెడ్డి) ప్రథమ స్థానం సాధించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక కంభం మండల శాఖ అధ్యక్షులు వరికుంట్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నారపరెడ్డి రమణారెడ్డి, చెకుముకి కన్వీనర్ షేక్ నాయబ్ రసూల్ ,ఉపాధ్యక్షులు పార్థసారథి, రమణ ,యూత్ నాయకుడు జావిద్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *