తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
అద్దంకి నియోజకవర్గం, కొరిశపాడు మండలంలోని పి. గుడిపాడు గ్రామంలోని ఫీడర్ చానెళ్లలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి పనుల పురోగతి, వేతనాల చెల్లింపు, పని పరిస్థితులు మరియు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణాభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.