తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-
కొడవలూరు మండలం, నాయుడుపాలెం పంచాయతీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ (BT) రోడ్డు, రూ.21 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ (CC) రోడ్లను ప్రారంభించాను.గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యం. ప్రతి గ్రామంలో అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ, ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తాం.ఈ అభివృద్ధి పనులు ప్రజలకు ఎంతో ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ, సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.