google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వై.పాలెం సర్కిల్ సీఐ గారు దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరు, పెండింగ్ యూఐ (UI) కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు (NBWs), స్మార్ట్ పోలీసింగ్ పారామీటర్ల అమలుపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా స్టేషన్‌లో నమోదైన పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్ (UI) కేసుల పురోగతిని పరిశీలించి, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నేరాల విచారణలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరగా నిర్వర్తించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని తెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ మరియు సమర్థవంతమైన కేసు దర్యాప్తుపై సిబ్బందికి పలు సూచనలు అందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *