తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
శ్రీ పి.అరుణ్ బాబు, గౌ!! మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ, విజయవాడ వారు తేదీ 30.06.2026 న కందుకూరు పట్టణంలో నూతనంగా మంజూరై నిర్మాణంలో ఉన్నటువంటి గృహాలను శ్రీ పి.శ్రీనివాస ప్రసాద్, జిల్లా ప్రధాన అధికారి(గృ) వారితో కలిసి తనిఖీ చేశారు. లబ్దిదారులతో గృహనిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు లబ్దిదారులు గృహాలను నాణ్యతతో నిర్మించుకోవటంపట్ల సంతృప్తి వ్యక్తపరిచినారు. లబ్దిదారులు గృహనిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలిఅని తగిన సూచనలను చేసినారు. ఈ కార్యక్రమములో శ్రీ యస్.మాధవరావు, కార్యనిర్వాహక ఇంజినీర్(గృ), కందుకూరు డివిజన్, శ్రీ పీ.వీ నారాయణ, ఉపకార్యనిర్వాహక ఇంజినీర్(గృ), కందుకూరు, మరియు శ్రీ యస్.కే గౌస్ బాషా, సహాయక ఇంజినీర్(గృ), కందుకూరు వారు పాల్గొన్నారు.