తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
కొమరోలు మండలం, తాటిచర్లమోటు గ్రామం: కొమరోలు మండలం తాటిచర్లమోటు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గిద్దలూరు రూరల్ సర్కిల్ సీఐ రామకోటయ్య సందర్శించి, విద్యార్థులతో మమేకమై పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు పాటించాల్సిన రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.