తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
జిల్లాలో SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా ఎన్నికల రోల్ అబ్జర్వర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి, ఐఏఎస్ అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ పి. రాజాబాబు, ఐఏఎస్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా శుద్ధీకరణ, యువ ఓటర్ల నమోదు, డబుల్ ఎంట్రీల తొలగింపు, మ్యాపింగ్ లోపాల సవరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ – 90.92% పూర్తి
కళాశాలల్లో యువ ఓటర్లకు విస్తృత అవగాహన 18–19 ఏళ్ల యువత ఓటరు నమోదుకు ప్రత్యేక ప్రాధాన్యత పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంపునకు ప్రత్యేక చర్యలు ఓటర్ల జాబితాలో పారదర్శకతకు క్షేత్రస్థాయి పరిశీలన ఉత్తమంగా పనిచేసిన BLOలకు ప్రోత్సాహం, గుర్తింపు
ప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు అవ్వాలి – ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకోవాలి.