తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:-
మంగళగిరి వద్దగల పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం రెండోరోజు కూడా కొనసాగింది. ఈ సమావేశంలో శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పలువురు నాయకులతో కలిసి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిపాలన, స్థానిక సంస్థల ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహం, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు… ఇతరఅంశాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కీలక సూచనలు అందిస్తున్నారు. నిన్నటి సమావేశం ముగిసిన అనంతరం…. దేవాదాయ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి నివాసంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలు భేటీ అయ్యారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో… అన్ని పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు గెలుచుకునే విధంగా ఉమ్మడి ప్రణాళిక రూపొందించుకున్నారు.