ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా SP శ్రీ హర్షవర్ధన్ IPS గారి ఆదేశాలమేరకు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
వేసవికాలంలో ప్రాపర్టీ నేరాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన నేర గ్యాంగులు సంచరిస్తున్నాయనే అనుమానంతో, శనివారం సాయంత్రం 05.00 గంటల నుండి 08.00 గంటల వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించవలసిందిగా తెలియజేయడమైనది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటల్స్, లాడ్జీలు, హై డౌట్ ప్లేసెస్, అలాగే ఊరి చివర డేరాలు/గుడారాలు వేసుకొని నివసిస్తున్న సంచార జాతులపై ఎంఎస్సీడీల ద్వారా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, అనుమానితులను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించి చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశించడమైనది.ఈ మేరకు గిద్దలూరు రూరల్ CI రామకోటయ్య రూరల్ సర్కిల్ పరిధిలోని strangers Living ప్రదేశాలు, లాడ్జ్ లు, రిసార్ట్ లు, గ్రామ చివర ప్రాంతాలలో అనుమానితుల కదలికల గురించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడమయినది.