ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరాయకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి మొక్కలను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు మరియు ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం అత్యంత అవసరమని అన్నారు. చెట్లు మనకు ప్రాణవాయువును అందించడమే కాకుండా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలని పిలుపునిచ్చారు.బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోర్టు ప్రాంగణాన్ని మరింత పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చెట్ల పెంపకం ద్వారా ప్రకృతి సమతుల్యతను కాపాడటంతో పాటు స్వచ్ఛమైన వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించవచ్చని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో న్యాయవాదులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు.అనంతరం న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కలిసి వివిధ రకాల మొక్కలను నాటారు. మొక్కల పెంపకం మాత్రమే కాకుండా వాటి సంరక్షణ కూడా అంతే ముఖ్యమని పేర్కొంటూ, నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణం పచ్చదనంతో కళకళలాడాలని, పర్యావరణ పరిరక్షణపై సమాజంలో మరింత అవగాహన పెంపొందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి బక్కమంతల వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాదులు కొల్లూరి వెంకట నరసింహారావు, రాఘవేంద్ర, సంజీవరెడ్డి, శ్రీనివాసులు, పంతగాని వెంకటేశ్వర్లు, వంశీ, రియాజ్, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *