ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక గొప్ప అండగా నిలుస్తోందని దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.దర్శి టిడిపి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దర్శి నియోజకవర్గానికి చెందిన 6 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు, 3 మందికి LOC (Letter of Credit) అందజేశారు. మొత్తం రూ. 10,67,487 విలువైన ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే సకాలంలో సహాయం అందేలా చొరవ తీసుకున్న డా. గొట్టిపాటి లక్ష్మీ గారికి మరియు కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *