తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యం లో భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాషి వెంకట రామాంజనేయులు పాల్గొని ఎంతో మహిమాన్వితం అయిన కోటా సత్యమంభా దేవాలయం లో కొలువైన సత్యమ్మ తల్లిని దర్శనం చేసుకుని ఇటీవల దేశము లో
జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీ సాధించి ప్రభుత్వాల ను ఏర్పాటుకు సత్యమ్మ తల్లి దీవనలు ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈ కార్య క్రమంలో వెంకటేష్ యాదవ్, రామయ్య, సాయి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అప్పిశెట్టి ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఈ దేవాలయము దర్శనము ఎంతో మహిమాన్వితం అని,చోళుల కాలంలో దేవాలయము నిర్మాణం జరిగింది అని, ఈ ఆలయ నిర్మాణం శ్రీకృష్ణ దేవరాయలు రెండవ భార్య వరద రాజమ్మ దగ్గర ఉండి చేపట్టడం జరిగింది అని తెలియ చేశారు.