తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకే తూర్పు నాయుడు పాలెం ప్రాథమిక పాఠశాలను MEO 2 మహతి బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇచ్చింది లేనిది పరిశీలించారు. విద్యార్థుల తెలుగు, ఆంగ్లం, గణిత సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులందరూ కనీస సామర్థ్యాలు సాధించాలని, GFLN ప్రకటించాలని, అందుకోసం ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కోరారు. అనంతరం తాళ్ళపాలెం ప్రాథమిక పాఠశాల ను సందర్శించి రికార్డు లను, విద్యార్థుల సామర్థ్యాలను తనిఖీ చేశారు. విద్యార్థుల నమోదు ను పెంచాలని HM కు సూచించారు. విద్యార్థులకు కిట్లు అందినవి లేనిది పరిశీలించారు. ఉపాధ్యాయులందరూ సమయ పాలన పాటించాలని, పాఠశాల ప్రారంభ సమయం లోనే తనిఖీలు చేస్తామని బాలాజీ తెలిపారు