google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

వెంగముక్కలపాలెం గ్రామంలో కోతముక్క పేకాట పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.. 7 మంది పట్టివేత, వారి వద్ద నుండినగదు RS 1460/- 7 ఫోన్లు స్వాధీనం. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ CI కమలాకర్ గారు, ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై చెంచయ్య గారు మరియు సిబ్బంది దాడి.కోత ముక్క పేకాట నిర్వహణపై ఒంగోలు టాస్క్ఫోర్స్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఒంగోలు తాలూకాపోలీస్ స్టేషన్ పరిధిలో వెంగముక్కల పాలెం గ్రామ నిర్వహించిన దాడిలో అక్రమంగా కోతముక్క పేకాట నిర్వహిస్తున్న ఏడుగురుని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 7 సెల్ ఫోన్లు RS 1460/- నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. వారిని తదుపరి చర్యల నిమిత్తం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed