google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా సమీక్షా మండలి సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి దర్శి టిడిపి ఇన్‌చార్జి డా గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా దొనకొండలోని 46 చెరువుల అభివృద్ధి, ₹100 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనలు, చెరువుల పూడికతీత, తాగునీటి సమస్య పరిష్కారం, రైతులకు సాగునీటి అందుబాటు, పారిశ్రామికాభివృద్ధిపై చర్చించారు. ఈ నెల 23న జిల్లా కలెక్టర్ ప్రతిపాదిత ప్రాంతాలను సందర్శించి అంచనాలు సిద్ధం చేస్తారని, దొనకొండను కరువు రహిత అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని Dr. గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు.ఈ సమావేశంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయకుమార్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, OUDA చైర్మన్ షేక్ రియాజ్, PDCC బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి సుచిత్ర వీరయ్యతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed