తొలి శుభోదయం న్యూస్ మద్దిపాడు:-
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం నందు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కృష్ణదేవరాయ కాపు సేవా సంఘం తరుపున ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాథ్, కాపు సంఘం నాయకులు దాసరి రాము , జనసేన పార్టీ నాయకులు ఆమంచి స్వాములు , గొర్రెపాటి శ్రీనివాసులు, శ్రావణి వెంకటేశ్వర్లు , జనసేన పార్టీ వినుకొండ నియోజకవర్గ ఇంచార్జ్ నిశ్శంకరావు శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసరావు, మద్దిపాడు మండల అధ్యక్షులు బాల సుబ్రమణ్యం, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, శివ సింగ్, వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.