తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, 10వ తరగతిలో అద్భుత ఫలితాలు సాధించిన కందుకూరు డివిజన్ విద్యార్థులకు అభినందనలు..మంగళవారం కందుకూరు MPDO కార్యాలయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు HMలను సత్కరించడం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలలు నేడు కార్పొరేట్ సంస్థలకు దీటుగా రాణిస్తున్నాయి. మౌలిక వసతులు, నాణ్యమైన భోజనం, ముందే అందిన కిట్లు విద్యార్థుల విజయానికి తోడ్పడ్డాయి.ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం ఉంచండి – మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి.