తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రజల భద్రత, ప్రశాంతత కోసం కందుకూరు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారు. రాత్రి 11:30 గంటల తర్వాత అత్యవసర పరిస్థితులు, వైద్య అవసరాలు మినహా ఎవరూ అనవసరంగా బయట సంచరించవద్దు.
త్రిబుల్ రైడింగ్, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, అనుమానాస్పదంగా సంచరించడం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి.
ఒక్కరి నిర్లక్ష్యం కుటుంబానికి ఇబ్బంది, సమాజానికి ప్రమాదం.
నియమాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత.
ప్రజల రక్షణే మా ధ్యేయం – చట్ట అమలే మా కర్తవ్యం.
సహకరించండి సురక్షితంగా ఉండండి.