తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో డీల్ ఆటో బాలాజీ సార్ మరియు సిపిఎం ఆమెన్ గారి ఆదేశాలతో పాకల గ్రామంలో అవగాహన కళాజాతర నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో హెచ్ఐవి ఎలా వస్తుంది ఎలా రాదు.. హెచ్ఐవి సోకిందేమోనని అనుమానం ఉన్నవారు 1097 కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఏఆర్టి మందులు వాడడం ద్వారా జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చని కళాకారులు పాటల ద్వారా వివరించారు.. టీబి వ్యాధి దాని లక్షణాలు నివారణ మార్గాలు
యువత డ్రగ్స్కు బానిస కాకుండా చైతన్యవంతంగా ముందుకెళ్లాలని, డ్రగ్స్ మానుకో లేని యువత డి అడిక్షన్ సెంటర్స్ వెళ్లి అక్కడి సలహాలు సూచనలు పొందాలని సూచిస్తూ పాటలు నాటికలు ప్రదర్శించడం జరిగింది.. కార్యక్రమంలో DRP స్వరూప్ కుమార్ clw మహేష్, మరియు కళాజాత సభ్యులు జయరావు నాగేశ్వరరావు రోజా రాణి తదితరులు పాల్గొన్నారు..