తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
నాయుడుపేటలో ఆదివారం నిర్వహించిన ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్లో సింగరాయకొండకు చెందిన చదరంగ క్రీడాకారుడు సయ్యద్ షఫీజ్ ప్రతిభ చాటాడు. ఆర్ఎల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులతో పోటీపడి 17వ స్థానంలో నిలిచి, ₹1,000 నగదు బహుమతిని అందుకున్నాడు.ఈ విజయంపై కోచ్ వంశీకృష్ణతో పాటు పలువురు క్రీడాభిమానులు షఫీజ్ను అభినందించారు.