తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యం లో సీనియర్ బీజేపీ నాయకులు దప్పిలి వినోద్ కుమార్ రెడ్డి తండ్రిబి స్వర్గీయ దప్పిలి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి జ్ఞాపకార్ధం గిద్దలూరు పట్టణ ఆర్ టి సి డిపో లో ప్రయాణికుల వేసవి తాపానికి చల్లని నీటిని అందించే ఉద్దేశ్యం తో మట్టి కుండలను ఆర్ టి సి డిపో మేనేజర్ మౌనిక కి అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె వి నారాయణ పాల్గొని దప్పిలి కుటుంబం ఎన్నో సంవత్సరాలు గా సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని, మును ముందు వారి కుటుంబం మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అందుకు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆశిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాషి వెంకటరామాంజనేయులు,మరియు ఆర్ టి సి మేనేజర్,ఆర్ టి సి సిబ్బంది పాల్గొనడం జరిగింది.