తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

విధినిర్వహణ లో కార్యక్షేత్రం లో ఎక్కడైనా లోపాలు చోటు చేసుకుంటే పోలీస్ పరంగా సరిదిద్దుకుంటామని మీడియా కూడా అదే విధంగా సమన్వయం తో సహకరించాలని సింగరాయకొండ సి ఐ వై శ్రీహరి మీడియా ప్రతినిధులకు పిలుపు ఇచ్చారు . శుక్రవారం సాయింత్రం సింగరాయకొండ పోలీస్ సర్కిల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సింగరాయకొండ, జరుగుమల్లి ఎస్సై ల మీడియా ప్రతినిధుల పరిచయ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ మీడియాది స్నేహ పూర్వక బంధం అని ప్రజలకు సత్వర న్యాయం రక్షణ కల్పించడం లో సమన్వయంతో పని చేద్దామని కోరారు.విధినిర్వహణ లో అక్కడక్కడ పొరపాట్లు చోటు చేసుకుంటాయని వాటిని సానుకూలంగా అర్థం చేసుకుని సహకరించాలని సి ఐ శ్రీహరి కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రహసనం మొదలయిందని ఇంకా ప్రకటన రావాల్సి ఉంది కనుక ఇప్పటి నుండి శాంతి భద్రతల పరిరక్షణ కోసం కలిసి సేవలు అందించాలనింకోరారు. సర్కిల్ పరిధిలో సింగరాయకొండ, జరుగుమల్లి, టంగుటూరు పోలీస్ స్టేషన్ ల పరిధిలో ప్రజలు పోలీస్ కి సహకరించాలని చెడునడత గల వారి సమాచారం, సంఘ విద్రోహ కార్యక్రమాలు, చెడు వ్యసనాలు,గంజాయి సరఫరా చెలామణి,జూదం, బెట్టింగ్ నేరాల నియంత్రణ, దొంగతనాలు అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైన చర్యలు చేపడతామని సి ఐ వివరించారు.గృహ దోపిడీలు,దొంగతనాల నివారణ లో భాగంగా ఎల్ హెచ్ ఎం ఎస్ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ యాజమాన్యాల కింద సేవలు అందిస్తున్న వృత్తి జర్నలిస్ట్ లు ప్రత్యేకించి సింగరాయకొండ కేంద్రానికి సంబంధించి పలు సమస్యలను ఆయన దృష్టిలో పెట్టి శాంతి భద్రతలు పరిరక్షణ , రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సి ఐ దృష్టికి తీసుకు వెళ్ళారు. వృత్తి జర్నలిస్ట్ లు తమ దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సింగరాయకొండ ఎస్సై లేళ్ల సుధీర్ కుమార్, జరుగుమల్లి ఎస్సై పి భాగ్యరాజ్ లను సింగరాయకొండ మీడియా ప్రతినిధులకు పరిచయం చేశారు. అనంతరం వివిధ యాజమాన్యాల కింద సేవలు అందిస్తున్న మీడియా ప్రతినిధులు వ్యక్తిగతంగా వాటిని పరిచయం చేసుకున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *