తొలి శుభోదయం న్యూస్ పొదిలి:-
పొదిలి మండలంలోని ఏలూరు గ్రామంలో MRPS (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) గ్రామ అధ్యక్షుడు చిన బెన్నీ తల్లి గారు స్వర్గస్తులయ్యారు. సమాచారం తెలుసుకున్న MRPS ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటి మాదిగ ఏలూరు గ్రామాన్ని సందర్శించారు. అక్కడ ఆమె పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మరణించిన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, శోకతప్త హృదయంతో ఉన్న చిన బెన్నీ కుటుంబానికి MRPS అధినేత బ్రహ్మన్న నాయకత్వంలో ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
నివాళులర్పించిన వారిలో
ఈ కార్యక్రమంలో MRPS నియోజకవర్గ ఇంచార్జ్ జండ్రాజుపల్లి బాలరాజు మాదిగ, MRPS నాయకులు బక్కరాజు మాదిగ, గుంటూరి చిట్టిబాబు మాదిగ, గుంటూరి కామేశ్వరరావు మాదిగలతో పాటు గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొని నివాళులర్పించారు.