తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
నేటి నుంచి జరగనున్న వర్చువల్ మహానాడు సందర్భంగా క్లస్టర్ నెం.8 ముండ్లమూరు మండలం ఉల్లగళ్లు పరిధి, క్లస్టర్ నెం.5 దర్శి మండలం ఏఎంసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మహానాడు వేదికలను పరిశీలించిన డా. గొట్టిపాటి లక్ష్మీ.అనంతరం దర్శి టిడిపి కార్యాలయంలో మహానాడు నిర్వహణపై పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.“మహానాడు పండుగను ప్రతి కార్యకర్త విజయవంతం చేయాలి” అని డా. గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు.సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు రాఘవేంద్ర, యువనేత కడియాల లలిత్ సాగర్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.కార్యక్రమంలో దర్శి మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, టౌన్ అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ, క్లస్టర్ ఇన్చార్జ్లు నారపుశెట్టి మధు, నానబాల అంకయ్య, రూపినేని రామారావు, పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.